లాక్డౌన్తో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పాడి రైతులకు విశాఖ డెయిరీ మంజూరు చేసిన నిధులను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అందించారు. నర్సీపట్నం మినీ డెయిరీ పరిధిలోని 19 వేల మంది రైతులకు ఈ సహాయం అందజేశారు. డెయిరీ సేవలను వినియోగించుకుని విశాఖ డెయిరీ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
పాడి రైతులకు విశాఖ డెయిరీ సహాయం
లాక్డౌన్తో పేదలు, రోజువారీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన విశాఖపట్నం జిల్లా విశాఖ డెయిరీ నర్సీపట్నం పరిధిలోని పాడి రైతులకు నిధులు మంజూరు చేసింది. ఈ ఆర్థిక సహాయాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమశంకర్ గణేష్ పంపిణీ చేశారు.
చెక్కును పంపిణీ చేస్తున్న నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్