ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాకొద్దీ మాష్టారు.... మార్చండి సారూ...

విశాఖ మన్యంలో విద్యా వ్యవస్థ అడుగంటిపోతుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిగురవే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఐటీడీఏ వద్ద ధర్నా చేశారు.

By

Published : Jul 20, 2019, 12:58 PM IST

ఐటీడీఏ వద్ద బైఠాయించిన విద్యార్థులు, తల్లితండ్రుల

విశాఖ మన్యం హుకుంపేట మండలం రంగపల్లిలో పని చేస్తున్న పూర్ణచంద్రరావు అనే ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా పాడేరు ఐటీడీఏ వద్దతల్లిదండ్రులు ధర్నా చేశారు. 7ఏళ్లుగా సక్రమంగా విధులు నిర్వహించడం లేదని... పాఠాలు చెప్పడం లేదన్నారు. మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ వద్ద చదువుతున్న నేర్చుకున్న ఐదో తరగతి విద్యార్థి కూడా అక్షరం ముక్క రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మొర విన్న గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్...​ సంబంధిత పాఠశాలకు ఫోన్ చేసి పూర్ణచంద్రరావును సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో సుశీల అనే ఉపాధ్యాయురాలిని నియామకానికి సూచించారు.

తమ బాధను చెపుతున్న విద్యార్థి తండ్రి

ABOUT THE AUTHOR

...view details