ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... జిల్లాలో రెవిన్యూ పరంగా 3అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి లోని తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన పరిశీలించిన అనంతరం స్పందన మీ సేవలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు ఉగాది కల్లా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే 3 ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. స్పందన ఫిర్యాదులు పరిష్కారంలో విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట అనకాపల్లి ఆర్డివో సీతారామారావు తహసిల్దార్ ప్రసాదరావు ఎంపీడీవో ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు.
స్పందన సమస్యల పరిష్కారంలో విశాఖ ముందంజ
విశాఖ జిల్లా అనకాపల్లిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ శివ శంకర్ పరిశీలించారు. స్పందన సమస్యల పరిష్కారంలో విశాఖ రెండో స్థానంలో ఉందని తెలిపారు.
స్పందన సమస్యల పరిష్కారంలో విశాఖ ముందంజ