చోడవరంలో వెలుగు ఉద్యోగుల నిరసన ఉద్రిక్తం
విశాఖ జిల్లా చోడవరంలో వెలుగు ఉద్యోగులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగాల నుంచి తమను అన్యాయంగా తొలగించారంటూ... పెద్దసంఖ్యలో మహిళలు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కార్యాలయం ముందు బైఠాయించారు. 2 రోజుల నుంచి అక్కడే ఆందోళనను కొనసాగిస్తున్నారు. నిరసనను విరమించని కారణంగా.. పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వారిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసి... స్వచ్ఛందంగా నడుచుకుంటూ ఠాణాకు వెళ్లారు.
velugu-employees-protest-in-chodavaram
Last Updated : Nov 9, 2019, 3:18 PM IST