విశాఖజిల్లా దేవరాపల్లి లో యూరియా కోసం ఉదయం నుంచే వందల సంఖ్యలో రైతులు తరలివచ్చారు.వ్యవసాయ ప్రాథమిక సొసైటీకి వచ్చిన యూరియ కొద్దిమొత్తంలోనే వచ్చిందన్న వార్తలతో,రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు.ప్రస్తుతం యూరియా కొరత ఏర్పడిందని,బుధవారం మళ్లీ రావాలని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు.అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతోందని వాపోతున్నారు.
యూరియా కోసం బారులు తీరిన రైతులు
యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల రైతులు సొసైటీలకు పరుగులు తీస్తున్నారు.
మందుల కొరత