ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2021, 4:14 PM IST

ETV Bharat / state

గుర్తుతెలియని వాహనం ఢీ.. తండ్రీకుమారులు మృతి

విశాఖ జిల్లా చింతపల్లి మండలం మండిగుంటలో ద్విచ‌క్ర‌వాహ‌న ప్రయాణికులు ఇద్దరు ప్ర‌మాదానికి గురయ్యారు. గూడెం కొత్త‌వీధి మండ‌లం జెర్రిల పీహెచ్​సీలో ఆరోగ్య స‌హాయ‌కునిగా ప‌నిచేస్తున్న ర‌వి, అత‌ని కుమారుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనగా.. అక్కడికక్కడే మరణించారు.

road accident in mandigunta
మండిగుంటలో రోడ్డు ప్రమాదం

ద్విచ‌క్ర‌వాహ‌న ప్ర‌మాదంలో తండ్రీకుమారులు మరణించిన విషాధ ఘటన.. విశాఖ జిల్లా చింత‌ప‌ల్లి మండలం మండిగుంటలో జరిగింది. గూడెం కొత్త‌వీధి మండ‌లం జెర్రిల పీహెచ్​సీలో ఆరోగ్య స‌హాయ‌కునిగా ప‌నిచేస్తున్న ర‌వి, అత‌ని కుమారుడు.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియ‌ని వాహ‌నం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. సంఘ‌ట‌నా స్థ‌లంలోనే వారిరువురూ ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు. ర‌వి హెల్మెట్ ధ‌రించినా ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడన్నారు.

ABOUT THE AUTHOR

...view details