ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో దేశభక్తి యువత పాత్రపై సదస్సు

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వ జునియార్ కళాశాలలో ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో దేశభక్తి యువత పాత్రపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లడుతూ ఈరోజు మనం స్వేచ్చాయుతంగా జీవిస్తున్నామంటే ఎందరో దేశ స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తెచ్చారని పేర్కోన్నారు.

By

Published : Aug 15, 2019, 6:50 AM IST

యువత పాత్రపై సదస్సు

యువత దేశభక్తిని పెంచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ వి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈటీవీ భారత్ ఈనాడు ఆధ్వర్యంలో దేశభక్తి యువత పాత్ర అనే అంశంపై సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈరోజు మనం స్వేచ్చాయుత వాతావరణంలో జీవిస్తున్నామంటే దానికి కారణం ఎందరో ఆమరవీరుల ప్రాణత్యాగం వల్ల అని గుర్తుంచుకోవాలన్నారు. యువత దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం.. స్వాతంత్రం సాధిస్తామన్న నినాదంతో స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details