ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 5, 2021, 4:25 PM IST

ETV Bharat / state

'ప్రైవేటీకరణకు నిరసనగా.. విశాఖ, అనకాపల్లి ఎంపీలు రాజీనామా చేయాలి'

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ, అనకాపల్లి ఎంపీలు రాజీనామా చేయాలని తెదేపా నేతలు కోరారు. కేంద్రానికి తమ గొంతు వినిపించాలని అన్నారు.

tdp leaders on privatization of vishaka steel plant
tdp leaders on privatization of vishaka steel plant

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ, అనకాపల్లి ఎంపీలు రాజీనామా చేయాలని తెదేపా నేతలు డిమాండ్​ చేశారు. 53 రోజులుగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదని తెదేపా నేతలు గోవింద్​ రెడ్డి, కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ, అనకాపల్లి ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి కేంద్రానికి తమ గొంతు వినిపించాలని కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అన్ని పార్టీలు కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details