ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్న కల్యాణ వేడుకకు ఏర్పాట్లు పూర్తి

సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహ కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపటి స్వామి వారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

By

Published : Apr 15, 2019, 9:27 PM IST

అప్పన్న కల్యాణ వేడుకకు సుందరంగా సిద్ధమైన సింహాద్రి

అప్పన్న కల్యాణ వేడుకకు సుందరంగా సిద్ధమైన సింహాద్రి

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహ కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపటి స్వామి వారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కల్యాణ ఘట్టాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సింహాచలం కొండపైన ప్రత్యేకమైన క్యూలైన్లు, సింహగిరిపైకి బస్సు సదుపాయం కల్పించారు. రేపు రాత్రి 8 గంటలకు స్వామివారి రథయాత్ర జరగనున్నది. ఈ యాత్రలో స్వామివారిని రథంపై అధిష్టింపచేసి ఆలయ గాలిగోపురం చుట్టూ ఊరేగిస్తారు. రథయాత్ర అనంతరం తొమ్మిదిన్నర గంటలకు కల్యాణ మహోత్సవం జరగనుంది. స్వామి వారి కల్యాణ మండపాన్ని సుందరంగా పుష్పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు దంపతులు పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details