ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 11, 2020, 3:40 PM IST

ETV Bharat / state

విశాఖలో 'సింహ సేనాపతి' పుస్తక ఆవిష్కరణ

'సింహ సేనాపతి' పుస్తకాన్ని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించారు. సీబీఐ పూర్వ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ... పుస్తకావిష్కరణ చేశారు.

simha senapati book inaugurated at Vishakhapatnam
విశాఖలో 'సింహ సేనాపతి' పుస్తక ఆవిష్కరణ

ప్రపంచంలోని 108 మంది ప్రముఖుల విశేషాలతో రూపొందించిన 'సింహ సేనాపతి' పుస్తక ఆవిష్కరణ సభను విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. వీరం శెట్టి సతీశ్​ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీబీఐ పూర్వ సంయుక్త సంచాలకుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

వాకాడ శ్రీనివాస్ రచించిన సింహ సేనాపతి పుస్తకాన్ని అభిమానుల సమక్షంలో లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ప్రముఖ బాక్సర్ కోరుకొండ అరుణ, చిన్నారి విశ్వ విహాన్, పలువురు హాజరయ్యారు. పుస్తకంలో ఉన్న ప్రముఖుల్లో.. లక్ష్మీనారాయణ కూడా ఒకరని రచయిత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details