ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 13, 2020, 7:05 PM IST

ETV Bharat / state

కరోనా టీకా పంపిణీపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం

కరోనాపై పోరాటానికి వ్యాక్సిన్లు సిద్ధమవుతున్న సమయంలో.. వాటి పంపిణీపై ప్రజారోగ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రంథాలయంలో నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో వైద్యులు, వాక్సిన్ నిపుణులు, ఆరోగ్య పరిరక్షణ సంస్థలు పాల్గొన్నాయి.

round table meeting on corona vaccination at vishakapatnam
కరోనా టీకా పంపిణీపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం

కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి వివిధ వాక్సిన్లు సిద్ధం అవుతున్న సమయంలో.. వాటి పంపిణీపై ప్రజారోగ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో వైద్యులు, వాక్సిన్ నిపుణులు, ఆరోగ్య పరిరక్షణ సంస్థలు పాల్గొన్నాయి. వాక్సిన్​ను ప్రతి ఒక్కరికి అందించాలని చర్చలో నిపుణులు అభిప్రాయపడ్డారు. వాక్సిన్​పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వాక్సిన్ వల్ల ఏమైనా తేడాలు వచ్చినా.. వాటిని నివారించే అంశాలపై ప్రజలకు తెలియజేయాలని అభిప్రాయపడ్డారు. అందరికి ఉచిత టీకా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details