ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 5, 2020, 8:39 PM IST

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి: రవీంద్రనాథ్ రెడ్డి

కార్మికుల సంక్షేమం కోసం ఆర్టీసీని సీఎం జగన్ ప్రభుత్వంలో విలీనం చేశారని వైయస్​​ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుంటే...జగన్ మాత్రం ప్రైవేటు సంస్థలను ప్రభుత్వపరం చేస్తున్నారని అన్నారు.

రవీంద్రనాథ్ రెడ్డి
రవీంద్రనాథ్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం సైతం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుంటే...రాష్ట్రంలో సీఎం జగన్ మాత్రం ప్రైవేటు సంస్థలను ప్రభుత్వపరం చేస్తున్నారని వైయస్​​ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ సీతమ్మధారలో జరిగిన సంఘ సమావేశంలో పాల్గొన్న ఆయన...ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సంఘాలు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా పని చేయాలని.. ఉద్యోగ, కార్మిక సంక్షేమానికి కృషి చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details