ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 3, 2020, 6:42 PM IST

ETV Bharat / state

'చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు'

చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విశాఖ మన్యం జి.మాడుగుల మండలంలో చట్టవ్యతిరేక పనులు చేయవద్దని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

'చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు'
'చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు'

చట్టవ్యతిరేక పనులకు పాల్పడవద్దుంటూవిశాఖ మన్యం జి.మాడుగుల మండలంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీఐ దేవుడు బాబు ఆధ్వర్యంలో పోలీసులు, గ్రామస్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐ దేవుడు బాబు స్వయంగా డప్పు కొట్టి దండోరా వేశారు. పేకాట, కోడి పందేలు, గంజాయి, చిట్టీలు, మద్యం తాగి గ్రామాల్లో సంచరించడం వంటివి చేయకూడదని ప్రచారం చేశారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details