ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రద్ధ హాస్పిటల్ ఎండీ కోసం పోలీసుల గాలింపు

వైద్యం ముసుగులో కిడ్నీ అక్రమ విక్రయాలకు పాల్పడుతుతన్న శ్రద్ధ హాస్పిటల్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఓ వైపు త్రిసభ్య కమిటీ, మరోవైపు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆసుపత్రి యాజమాన్యం కోసం గాలింపు చేపడుతున్నారు.

By

Published : May 14, 2019, 4:49 PM IST

శ్రద్ధ హాస్పిటల్

కిడ్నీల విక్రయం ఘటనపై పోలీసుల "శ్రద్ధ"

విశాఖలోని శ్రద్ధ హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ అక్రమ అమ్మకాల ఘటనపై జిల్లా యంత్రాగం నియమించిన త్రిసభ్య కమిటీతో పాటు విశాఖ పోలీస్ కమిషనరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్​లో ఉన్న శ్రద్ధ హాస్పిటల్ పరిపాలన విభాగం ముఖ్య వ్యక్తి జె.కుమార్ వర్మను రెండు రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. మహారాణిపేట పోలీస్స్టేషన్​లో కుమార్ వర్మను విచారిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రి ఎండీ ప్రదీప్ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. రెండు బృందాలు బెంగళూరు వెళ్లాయి. త్రిసభ్య కమిటీ శ్రద్ధ హాస్పిటల్ పరిపాలన సంబంధ కాగితాలను పరిశీలన చేసి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతోంది.

ABOUT THE AUTHOR

...view details