విశాఖలో నూతన సంవత్సరం పురస్కరించుకొని సంపత్ వినాయక దేవస్థానంలో అర్థరాత్రి నుంచి భక్తులు స్వామిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టే సమయంలో ఆలయం వద్ద ప్రత్యేక హోమం నిర్వహించారు. కొత్త ఏడాదిలో మంచి జరగాలని భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.