ఏపీఐఐసీకి భూమి ఇచ్చేందుకు సిద్ధం: కరణం ధర్మశ్రీ
చోడవరంలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఆ ప్రాంత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నాలుగు మండలాల తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
విశాఖ జిల్లా చోడవరంలోని భూ సమస్యలను పరిష్కారానికి ఎమ్మెల్యే తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. తహశీల్దార్ల నుండి సర్వే నెంబర్లు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌళిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కు వంద ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుచ్చయ్యపేట మండలం కొమాళ్లపూడి వద్ద 1630 సర్వే నంబరు గల 100 ఎకరాల భూమిని ఏపీఐఐసీకు ఇవ్వాలని ఈ సమీక్షలో తీర్మానించారు. దీని ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి నాలుగు మండలాల తహశీల్దార్లతో పాటు అనకాపల్లి ఆర్డీవో సూర్యకళ హాజరయ్యారు.