ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2021, 6:06 PM IST

ETV Bharat / state

మాన్సాస్ ట్రస్టులో అక్రమాలు జరిగాయి...త్వరలోనే బయటపెడతాం: వెల్లంపల్లి

సింహాద్రి అప్పన్నను దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన ఆయనకు ఈవో సూర్యకళ, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...అశోక్ గజపతిరాజు హయంలో మాన్సాస్ ట్రస్టులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

మాట్లాడుతున్న మంత్రి వెల్లంపల్లి

అశోక్‌ గజపతిరాజు హయాంలో మాన్సాస్‌ ట్రస్టులో అక్రమాలు జరిగాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. అన్నీ త్వరలోనే బయటపెడతామన్నారు. దేవదాయశాఖ నిధులు వాహనమిత్రకి తరలించారని ఆరోపణల్లో నిజం లేదన్నారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న వెల్లంపల్లి... ఆ తర్వాత కళ్యాణ మండపాన్ని సందర్శించారు. ప్రత్యేక తైలంతో శిల్పాలను శుద్ధిచేయడం బాగుందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details