విశాఖ జిల్లా చోడవరం కోర్టు సముదాయంలో లోక్ అదాలత్ నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి రాజీవ్ పాల్గొని 95కేసులను పరిష్కరించారు. ఇరుపక్షాల అంగీకారంతో రాజీ కుదిర్చారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జీ శ్రీనివాస్, సభ్యులు ప్రసాద్ నాయుడు, ఎం.సింహాచలం నాయుడు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
లోక్ అదాలత్ ద్వారా 95 కేసులు పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్లో భాగంగా విశాఖ జిల్లా చోడవరంలో అపరిష్కృతంగా ఉన్న 95కేసులను సీనియర్ సివిల్ జడ్జి రాజీవ్ పరిష్కరించారు. ఇరు పక్షాల అంగీకారంతో రాజీ కుదిర్చారు. కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
లోక్ అదాలత్