ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో 'కోహ్లీసేన' సాధన

రేపు ఆసీస్​తో జరగబోయే టీ20 మ్యాచ్​ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. వైజాగ్ వీసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆటగాళ్లంతా ముమ్మర సాధన చేశారు. ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులంతా ప్రాక్టీస్​లో పాల్గొన్నారు.

By

Published : Feb 23, 2019, 2:09 PM IST

విశాఖ మైదానంలో సాధన చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు

విశాఖ మైదానంలో సాధన చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు
విశాఖలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల సాధన ముమ్మరంగా సాగింది. రేపు ఆస్ట్రేలియాతో తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో... ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ.. బ్యాట్స్​మెన్, బౌలర్లు నెట్స్​లో తీవ్రంగా శ్రమించారు. కెప్టెన్ కోహ్లీ, ధోనీ, ధావన్, కార్తీక్, బుమ్రాతో పాటు... జట్టు సభ్యులంతా ప్రాక్టీస్​కు హాజరయ్యారు.సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎం.ఎస్.కే. ప్రసాద్ పర్యవేక్షించారు. ఆటగాళ్లను చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపారు.

ABOUT THE AUTHOR

...view details