సుప్రసిద్ధ చరిత్రకారుడు విశ్రాంత అధ్యాపకులు తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి హైదరాబాద్లో మృతి చెందారు. అనకాపల్లి వర్తక సంఘం లింగమూర్తి కళాశాలలో అధ్యాపకునిగా చేసిన ఆయన పదవి విరమణ.. అనంతరం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కొంత కాలపాటు ఈనాడు జర్నలిజం స్కూల్లో హిస్టరీ, పాలిటిక్స్ పాఠాలు చెప్పేవారు. చివరిసారిగా 2015 లో నిర్వహించిన కోరుకొండ సుబ్బరాజు శతదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈయన రాసిన గాంధీజీ సూక్ష్మ దర్శనం గ్రంథం అదే సభలో ఆవిష్కరించారు. 1965లో కాశ్మీర్ చరిత్ర రాశారు. అలాగే అనకాపల్లి చరిత్ర బొజ్జన్నకొండ ప్రాచీనతపై పరిశోధనలు చేసి పుస్తకాలు రాశారు.
సుప్రసిద్ధ చరిత్రకారుడు తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి మృతి
ప్రముఖ చరిత్రకారుడు విశ్రాంత అధ్యాపకులు తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి హైదరాబాద్ లో మృతి చెందారు. అనకాపల్లి చరిత్రను ఈయన తొలిసారిగా పరిశోధించారు.
సుప్రసిద్ధ చరిత్రకారుడు తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి మృతి