ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 20, 2021, 7:02 PM IST

ETV Bharat / state

స్వయంభూ వినాయకుడి సేవలో హైకోర్టు జడ్జి

విశాఖ జిల్లా చోడవరం పట్టణంలోని స్వయంభూ వినాయకుడిని జస్టిస్ ప్రవీణ్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా చోడవరం కోర్టును పరిశీలించారు.

High Court judge examining Chodavaram court in Visakhapatnam district
చోడవరం కోర్టును పరిశీలించిన హైకోర్టు జడ్జి

విశాఖ జిల్లాలోని చోడవరం కోర్టును సందర్శించిన హైకోర్టు జడ్జి సీ.ప్రవీణ్ కుమార్​కు అధికారులు స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన ఆయన.. కోర్టు అవరణలో మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలోని స్వయంభూ వినాయకుడిని జస్టిస్ ప్రవీణ్ కుమార్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చోడవరం కోర్టు నుంచి ఆలయానికి హైకోర్టు జడ్జి, విశాఖ జిల్లా జడ్జి హరిహరనాథ్ శర్మ, ఇతర న్యాయ అధికారులు కాలినడకన చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details