ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 12, 2020, 5:14 PM IST

ETV Bharat / state

ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు

నర్సీపట్నం, నాతవరంలో ధాన్యం కొనుగోళ్లను.. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు.

Grain purchases started in market yards
మార్కెట్ యార్డుల్లో ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు

విశాఖ జిల్లా నర్సీపట్నం మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాదికి సంబంధించి మార్కెట్ యార్డ్ తో పాటు.. నాతవరం లోనూ మరో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. నర్సీపట్నం మార్కెట్ యార్డ్ లోనే నేటి వరకు 150 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. వాతావరణం ఆశాజనకంగా లేని కారణంగా.. వరికుప్పలను తక్షణమే నూర్పిడి చేసి ధాన్యాన్ని విక్రయించేందుకు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చదవండి:డీజీపీని అడ్డుకున్న విశాఖ బాధితులపై కేసులు నమోదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details