ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 7, 2020, 9:13 PM IST

ETV Bharat / state

బంగారు నగలు పోగొట్టుకున్న మహిళ..నిఘా నేత్రాల సాయంతో గుర్తింపు

జగదాంబ జంక్షన్​లో ఓ మహిళ బంగారు అభరణాలను పోగొట్టుకుంది. దాంతో ఆమె స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్​కు నగలు దొరికినట్లు పోలీసులు గుర్తించారు. అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. అతనితోపాటు మరో ఆటో డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

two-persons-arrested
బంగారు నగల గుట్టు విప్పిన నిఘా నేత్రాలు

విశాఖలోని జగదాంబ జంక్షన్​లో ఓ మహిళ బంగారు ఆభరణాలను పోగొట్టుకున్న కేసును పోలీసులు ఛేదించారు. రాత్రివేళ కారులో ప్రయాణిస్తూ జగదాంబ జంక్షన్​ వద్ద బంగారు నగలు పోగొట్టుకున్నానని ఓ మహిళ, భర్తతో కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా కూడలిలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఓ ఆటో డ్రైవర్ నగల బ్యాగును తీసుకున్నట్లు నిర్ధారించుకుని అతన్ని విచారించారు. మరోడ్రైవర్​తో కలిసి ఆభరణాలను పంచుకున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అతని నుంచి మొత్తం 235 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details