ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాళం వేసిన ఇంట్లో చోరి...బంగారం,వెండి నగలు అపహరణ

విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి లంక జగన్నాధ రావు అనే వ్యక్తి ఇంట్లో బంగారు నగలు, వెండి వస్తువులు అపహరించారు.

By

Published : Jul 21, 2019, 11:39 PM IST

తాళం వేసిన ఇంట్లో చోరి

విశాఖ జిల్లా అనకాపల్లి శారదానగర్​లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు నగలు వెండి వస్తువులు అపహరించారు. లంక జగన్నాధ రావు అనే వ్యక్తి శారదానగర్ మూడవ వీధిలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరు గత కొన్ని రోజుల క్రితం చెన్నై వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని ఆరు తులాల బంగారు వస్తువులతో పాటు సుమారు 60 తులాల వెండి వస్తువులను అపహరించారు. చోరి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరించారు.

తాళం వేసిన ఇంట్లో చోరి

ABOUT THE AUTHOR

...view details