ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జలాశయాల అనుసంధానానికి ప్రభుత్వం కృషి అభినందనీయం'

By

Published : Dec 6, 2020, 1:01 PM IST

ఏలేరు కాలువ, తాండవ జలాశయం అనుసంధానానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి విశాఖలో పేర్కొన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళిన ప్రయోజనం లేకపోయిందన్న ఆయన జగన్మోహన్ రెడ్డి చూపిన చొరవ హర్షించదగ్గ విషయమన్నారు.

film actor r narayanamurthy
సినీనటుడు ఆర్. నారాయణమూర్తి

తూర్పు గోదావరి జిల్లా ఏలేరు కాలువను విశాఖ జిల్లా తాండవ జలాశయానికి అనుసంధానం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి తెలిపారు. నర్సీపట్నంలో స్థానిక శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏలేరు కాలువ నీరు.. తూర్పు, విశాఖ జిల్లాల మీదుగా స్టీల్ ప్లాంట్ కు తరలుతున్నప్పటికీ ఆయా జిల్లాల మెట్ట ప్రాంతాలకు సాగు నీరు అందజేత ఆశాజనకంగా లేదన్నారు. ఈ విషయాలను అధ్యయనం చేసిన విశాఖ జిల్లా పాయకరావుపేట, నర్సీపట్నం ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, ఉమాశంకర్ గణేష్​లతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని మరికొంతమంది శాసనసభ్యులు ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఈ రెండు జలాశయాల అనుసంధానానికి హామీ ఇచ్చారని నారాయణమూర్తి వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details