ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

తహసీల్దార్ డిజిటల్ కీని ఉపయోగించి విశాఖ కేంద్రంగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలను తయారు చేస్తున్న ముఠాను పాయకరావుపేట పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని ముగ్గురుని అరెస్టు చేయగా.. మరికొంత మంది కోసం గాలిస్తున్నారు.

By

Published : Mar 23, 2022, 7:33 PM IST

విశాఖ కేంద్రంగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలను తయారు చేస్తున్న ముఠాను పాయకరావుపేట పోలీసులు పట్టుకున్నారు. గతంలో పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్​గా పని చేసిన వ్యక్తి ఈ ముఠాకు నాయకుడని పోలీసులు వెల్లడించారు. తహసీల్దార్ డిజిటల్ కీని ఉపయోగించి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ముఠాలోని ముగ్గురుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details