ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 31, 2020, 12:12 AM IST

ETV Bharat / state

మన్యంలో కరోనా కట్టడికి రంగం సిద్ధం

విశాఖ జిల్లా మన్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం అధికారులు కొవిడ్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. మన్యంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో.. వైద్య సేవలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటీడీఏ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.

Breaking News

పాడేరు జిల్లా ఆస్పత్రిలో వంద పడకలతో కొవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖ మన్యం ఐటీడీఏ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందులో 20 ఆక్సిజన్ పడకలన్నాయనీ.. మరో 30 వరకు ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రస్తుతం పాడేరు పెదబయలులో కొవిడ్ కంట్రోల్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

కొవిడ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పడకలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం కొవిడ్ సెంటర్​లో భోజనం, వసతి కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. శానిటేషన్ పనులకు స్థానికులు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో.. ప్రైవేట్ సర్వీస్​కు పనులు అప్పగించినట్లు తెలిపారు. పాడేరు మన్య వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు తెరవకపోవటం శుభపరిణామమని అన్నారు. మన్యంలో కరోనా సమాచారం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామనీ.. కరోనా అనుమానితులు ఎవరైనా 180042500004 ఈ నెంబర్​కి ఫోన్ చేసి వివరాలు అందజేయవచ్చునని సూచించారు.

ఇదీ చదవండి:చోడవరం నియోజకవర్గంలో ఒక్క రోజే 14 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details