ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 30, 2020, 3:03 PM IST

ETV Bharat / state

అనకాపల్లిలో 8 కరోనా పాజిటివ్​ కేసులు

అనకాపల్లిలో సోమవారం 8 కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని గవరపాలెంలో 5 మంది వృద్ధులకు కొవిడ్​ వ్యాధి సోకినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు.

corona cases increasing in anakapalle mandal in visakha district
కంటైన్మెంట్​ జోన్లను సందర్శించిన పోలీసులు అధికారులు

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 8 మందికి కొవిడ్​ వ్యాధి సోకింది. అందులో గవరపాలెంలో ఉంటున్న ఐదుగురు వృద్ధులకు కరోనా వ్యాధి నిర్ధరణ అయ్యింది. కోట్ని వీధి, చిన్నరాజుపేటలో మూడు కేసులు నమోదయ్యాయి. డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సీఐ భాస్కరరావు అప్రమత్తమై ఆ ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details