కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అనకాపల్లి పార్లమెంట్ ఇంఛార్జ్ రుత్తుల శ్రీరాం మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నష్టపోయే విధంగా ఉన్న ఆ బిల్లులను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖ జిల్లా పాయకరావుపేటలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.