ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 11, 2020, 8:47 PM IST

ETV Bharat / state

రైతు వ్యతిరేక విధానాలకు కేంద్రం స్వస్తి పలకాలి: కాంగ్రెస్

రైతు వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని కాంగ్రెస్ అనకాపల్లి పార్లమెంట్ ఇంఛార్జ్ రుత్తుల శ్రీరాం మూర్తి డిమాండ్ చేశారు. పాయకరావుపేటలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

congress protest against on agri bills
రైతు వ్యతిరేక విధానాలకు కేంద్రం స్వస్తి పలకాలి: కాంగ్రెస్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అనకాపల్లి పార్లమెంట్ ఇంఛార్జ్ రుత్తుల శ్రీరాం మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నష్టపోయే విధంగా ఉన్న ఆ బిల్లులను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లా పాయకరావుపేటలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details