ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 28, 2020, 4:07 PM IST

ETV Bharat / state

"సమస్యల పరిష్కారానికి బ్యాంకు ఉద్యోగుల సమ్మె"

తమ సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ నిరసన చేపట్టింది. ఈనెల 31, వచ్చే నెల 1న సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. సమ్మెకు ప్రజలు సహకరించాలని కోరారు.

Bank employees strike
బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంకు ఉద్యోగుల సమ్మె

దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ ఆందోళన చేపట్టింది. విశాఖలోని సీతమ్మధార ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కన్వీనర్ సుందర్ మాట్లాడుతూ కేంద్రం ఎంతో కాలం నుంచి బ్యాంకు ఉద్యోగుల వేతనాల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 31, వచ్చే నెల 1న సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులంతా ఈ సమ్మెకు మద్దతు తెలియజేసి విజయవంతం చేయాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details