ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2021, 10:26 AM IST

ETV Bharat / state

సీఎం జగన్ చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం

వాహన మిత్ర పథకం ద్వారా మూడో ఏడాది రూ.10 వేలు విడుదల చేయడం అభినందనీయమని ఆటో డ్రైవర్లు అన్నారు. ఈ మేరకు విశాఖలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

auto-drivers-giving-thanks-to-cm-jagan-about-vahana-mithra-scheme
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని విశాఖలో ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. వాహన మిత్ర పథకంలో భాగంగా అర్హులైన డ్రైవర్లకు రూ.పది వేలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా మూడో ఏడాది రూ.10 వేలు ఆర్థిక సాయం అందించడం హర్షణీయమని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details