ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 20, 2021, 9:27 PM IST

ETV Bharat / state

వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం కొత్త లక్ష్మీపురంలోని వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

An unidentified body was found in a farm well in kottha Lakshmipuram, Narsipatnam Mandal, Visakhapatnam district
వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం కొత్త లక్ష్మీపురం రోడ్డు మార్గంలోని వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లిన కొంతమంది మహిళలు.. నీటిలో తేలుతూ ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చారు. అనంతరం గ్రామస్థులు శవాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న నర్సీపట్నం రూరల్ ఎస్సై రమేష్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

'రుణ భారాన్ని ఈక్విటీగా మారిస్తే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది'

ABOUT THE AUTHOR

...view details