ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా వర్గీయుల బాహాబాహీ.. 10 మందికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా పెద్ద సిర్లాంలో వైకాపా వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ దాడిలో 10 మందికి గాయాలయ్యాయి.

By

Published : May 2, 2020, 5:44 PM IST

Updated : May 2, 2020, 7:24 PM IST

ycp-leaders-fight-each-other-in-srikakulam
శ్రీకాకుళం జిల్లాలో గొడవ పడుతున్న వైకాపా వర్గీయులు

శ్రీకాకుళం జిల్లాలో గొడవ పడుతున్న వైకాపా వర్గీయులు

శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం పెద్ద సిర్లాం గ్రామంలో వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

గాయపడిన వారిని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతర్గత కలహాలే కొట్లాటకు కారణమని పోలీసులు తెలిపారు. గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు.

ఇదీ చదవండి :అధికారులకు అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్..!

Last Updated : May 2, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details