ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేటలో ఆహార భద్రతపై అవగాహన

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా అంగన్​వాడీ కార్యకర్తలకు.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

By

Published : Jun 7, 2019, 8:53 PM IST

నరసన్నపేటలో ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం

నరసన్నపేటలో ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళలు, చిన్నారులు ఆహార భద్రత పాటించేలా అంగన్​వాడి కార్యకర్తలు కృషి చేయాలని పోషన్ అభియాన్ స్వాస్థ్ అధికారి కె.సౌమ్య సూచించారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పని చేస్తోన్న అంగన్వాడి సిబ్బందికి ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో ఆహార భద్రత విలువలను పాటించేందుకు అంగన్​వాడి కార్యకర్తల కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారి అనంతలక్ష్మి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details