ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 11, 2020, 11:39 AM IST

ETV Bharat / state

రెండు లారీలు ఢీ.. ఒకరు మృతి

శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో ఒక లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక నుంచి వచ్చిన లారీ డ్రైవర్ మృతి చెందాడు.

రెండు లారీలు ఢీ..ఒకరు మృతి
two lorries crash in srikakulam dst one lorry driver died

శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్గారావు మృతి చెందాడు. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వైపు వెళ్తున్న లారీ మరమ్మతులకు గురై ఆగి ఉండగా వెనక నుంచి వచ్చిన విజయవాడకు చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ లారీ డ్రైవర్ దుర్గారావు మృతిచెందాడు. దీంతో కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details