పిడుగులు పడొచ్చు.. కాస్త జాగ్రత్తగా ఉండండి!
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
alert alert
శ్రీకాకుళం, తూర్లు గోదావరి జిల్లాలకు పిడుగుపాటు ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం, గొల్లప్రోలుతో పాటు.. శ్రీకాకుళం జిల్లా హిరమండలం, సారవకోట, పాతపట్నంలో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవొచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.