ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంట్లు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

By

Published : Oct 31, 2019, 10:49 AM IST

ఎలుగుబంటి దాడిలో వ్యక్తి తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడిలో వ్యక్తి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో రెండు ఎలుగుబంట్లు హల్​చల్ చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఉద్దానం ప్రాంతంలో యథేచ్ఛగా సంచరిస్తూ... ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా బాతుపురంలో ఉదయపు నడకకు వెళ్లిన బత్తిన కామేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అతన్ని స్థానికులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి ఎలుగుబంట్ల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు వేడుకొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details