ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాకని సూర్యకిరణాలు

అరసవల్లిలో భక్తులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ రోజు సూర్యకిరణాలు మూలవిరాట్​ పాదాలను తాకలేదు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరిగారు.

By

Published : Mar 9, 2019, 1:07 PM IST

Updated : Mar 9, 2019, 1:48 PM IST

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం

నిరాశతో భక్తులు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు ఈరోజు తాకలేదు. ఆదిత్యుని పాదాలను స్పృశించడానికి భానుడు చేసిన ప్రయత్నానికి మేఘం అడ్డుపడింది. ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో సూర్యకిరణాలు మూలవిరాట్​ను తాకుతాయి. స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు తాకి వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా మార్చి 9,10 తేదీల్లో... అలాగే అక్టోబర్ నెల 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాలు మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుంది. సూర్యకిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి మూలవిరాట్​ను తాకుతుంటాయి. ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకుజిల్లా నుంచే కాకుండా సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈరోజు భానుడి కిరణాలు స్వామివారి పాదాలను తాకకపోవడంతోతెల్లవారుజాము నుంచి వేచి ఉన్న భక్తులు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. రేపు మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకే ఆవకాశం ఉందని ప్రధాన అర్చకులు తెలిపారు.

Last Updated : Mar 9, 2019, 1:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details