వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతి అని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఒక మాట ఇచ్చారంటే అది జరిగి తీరుతుందన్నారు. పాదయాత్రలో రైతుల వెతలు చూసిన జగన్.. నేడు రాష్ట్రంలో ఉచితంగా 2 లక్షల వ్యవసాయ బోర్లు వేసే పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. జిల్లాలో 15వేల బోరుబావులకు ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. రాష్ట్రంలో 3 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. జలకళకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను స్పీకర్ ఆవిష్కరించారు.
వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతి: సభాపతి తమ్మినేని
వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతి అని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రైతుల కోసమే వైయస్సార్ జలకళ పథకం ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకం ద్వారా 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని చెప్పారు.
తమ్మినేని సీతారాం, సభాపతి