ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 28, 2020, 7:19 PM IST

ETV Bharat / state

వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతి: సభాపతి తమ్మినేని

వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతి అని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రైతుల కోసమే వైయస్సార్ జలకళ పథకం ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకం ద్వారా 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని చెప్పారు.

speaker tammineni sitaram about ysr jalakala
తమ్మినేని సీతారాం, సభాపతి

వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతి అని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఒక మాట ఇచ్చారంటే అది జరిగి తీరుతుందన్నారు. పాదయాత్రలో రైతుల వెతలు చూసిన జగన్.. నేడు రాష్ట్రంలో ఉచితంగా 2 లక్షల వ్యవసాయ బోర్లు వేసే పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. జిల్లాలో 15వేల బోరుబావులకు ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. రాష్ట్రంలో 3 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. జలకళకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను స్పీకర్ ఆవిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details