ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2020, 10:54 PM IST

ETV Bharat / state

ట్రాఫిక్ నిబంధనలపై.. విద్యార్థులతో వినూత్న ప్రదర్శన

ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కలిగేందుకు శ్రీకాకుళం జిల్లా రాజాం అధికారులు వినుత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నాటిక, నృత్యప్రదర్శన ద్వారా ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని కోరారు. సేవ్ లైఫ్ కార్యక్రమాన్ని చేపట్టారు.

presentation with students on traffic rules at rajam srikakulam dist
విద్యార్థులతో వినుత్న ప్రదర్శన

శ్రీకాకుళం జిల్లా రాజాంలో అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. పాలకొండ డీఎస్పీ శ్రీలత, రాజాం రూరల్ సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సేవ్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటిక, నృత్యా ప్రదర్శనతో ట్రాఫిక్ రూల్స్​ని వివరించారు.

నిబంధనలు పాటించకపోతే జరిగే ప్రమాదాలను కళ్లకు కట్టారు. విద్యార్థుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ పక్కాగా నిబంధనలు పాటించాలని డీఎస్పీ తెలిపారు. ద్విచక్రవాహనం నడిపేటప్పుడు శిరస్త్రాణం ధరించాలని కోరారు. కుటుంబం సురక్షితంగా ఉండాలంటే అధికారుల సూచనలు పాటించాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details