ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 12, 2019, 5:26 PM IST

ETV Bharat / state

మెుక్కలను సంరక్షించండి: నాబార్డు ఏజీఎం

పాతపట్నంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో నాబార్డు ఏజీఎం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మెుక్కలను సంరక్షించాలని ఆయన కోరారు.

మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన నాబార్డు ఏజీఎం

నాబార్డు దినోత్సవం సందర్భంగా... శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో బాలయోగి గురుకుల పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నాబార్డు ఏజీఎం మిలింద్ తలాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థులు ప్రతి రోజు మెుక్కలకు నీళ్లు పోసి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు.

మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన నాబార్డు ఏజీఎం

ABOUT THE AUTHOR

...view details