శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని కోటదుర్గమ్మ ఆలయాన్ని 14 రోజుల మూసివేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారి ప్రకటించారు. పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో కంటెన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ కమిషనర్ బీఎన్. శివప్రసాద్ ఆదేశాల మేరకు ఆలయం ఆగస్టు 14 వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో వాసుదేవరావు తెలిపారు. అమ్మవారికి అర్చకులు ఏకాంత సేవ నిర్వహిస్తారని ఈవో వెల్లడించారు.
పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం మూసివేత
కరోనా కంటెన్మెంట్ జోన్ ఏర్పాటు చేసిన దృష్ట్యా శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని కోటదుర్గమ్మ ఆలయాన్ని 14 రోజుల మూసివేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారి ప్రకటించారు. అమ్మవారికి అర్చకులు ఏకాంత సేవ నిర్వహిస్తారని ఈవో వెల్లడించారు.
పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం మూసివేత