శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, మడపాం టోల్గేట్ వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 46 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని బ్రహ్మపురం నుంచి శ్రీకాకుళం ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో శ్రీకాకుళానికి చెందిన గురునాథ్, పలాసకు చెందిన లక్ష్మణరావులను అరెస్టు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.