ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 6, 2021, 1:28 PM IST

ETV Bharat / state

EMPLOYEES UNION: రేపటి నుంచే ఉద్యోగుల ఉద్యమం : బండి శ్రీనివాసరావు

ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లినా.. ఇప్పటి వరకూ పీఆర్సీ నివేదిక ఇవ్వలేదని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు అన్నారు. రేపటి నుంచే తమ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

employees-started-protest-tomorrow-with-black-badges
నల్ల బ్యాడ్జీలతో రేపటి నుంచే ఉద్యమం

EMPLOYEES UNION: శ్రీకాకుళం జిల్లాలోని ఎన్జీవో కార్యాలయంలో ఏపీ ఐకాస, అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లినట్లు ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు తెలిపారు. కానీ.. ఇప్పటి వరకూ ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే.. రేపటి నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్న ఆయన.. ప్రాంతీయ సదస్సులను జయప్రదం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details