ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 5, 2020, 3:15 PM IST

ETV Bharat / state

కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో దాహం తీర్చుకునేందుకు గ్రామంలోకి వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు వెంబడించి గాయపరిచాయి. దీంతో దుప్పి అక్కడికక్కడే మృతి చెందింది.

srikakulam district
చుక్కల దుప్పే.. కుక్కల దాడిలో మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వేకువజామున దాహం తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పి కుక్కల దాడిలో మృతి చెందింది. సమీపంలో ఉన్న జోగి కొండ నుంచి కొండకు ఆనుకొని ఉన్న పెద్దింటి వారి వీధిలో చుక్కల దుప్పి వచ్చింది.. దానిని కుక్కల వెంబడించి గాయపరిచాయి. ఈ దాడిలో అది మృతి చెందగా స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి దుప్పి కళేబరాన్ని తీసుకుని వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details