ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2019, 4:58 AM IST

Updated : Oct 22, 2019, 8:28 AM IST

ETV Bharat / state

నేడు శ్రీకాకుళంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన

శ్రీకాకుళం జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగనుంది. సోమవారం 5 నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో సమీక్షించిన చంద్రబాబు.. ఇవాళ మిగిలిన నియోజకవర్గాల నేతలతో చర్చించనున్నారు.

చంద్రబాబు రెండో రోజు పర్యటన

ఎన్నికల అనంతరం తొలిసారి తెదేపా అధినేత శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సమీక్షించారు. నియోజకవర్గాల్లో పరిస్థితితో పాటు ప్రభుత్వ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తల్లో మనోదైర్యం నింపేలా ప్రభుత్వంపై.. చంద్రబాబు మాటల తూటాలు పేల్చారు.

రాజకీయ దాడులు, అక్రమ కేసుల బాధితులతో చంద్రబాబు ఇవాళ మాట్లాడనున్నారు. అనంతరం శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం, ఎచ్చెర్ల, నరసన్నపేట నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్షలు జరపనున్నారు.

Last Updated : Oct 22, 2019, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details