ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అగ్నికి ఆహుతైన 14 పూరిళ్లు

By

Published : Jan 18, 2021, 11:45 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని బొడ్డపాడు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని 14 పూరిళ్లు దగ్ధమయ్యాయి.

fire accident
శ్రీకాకుళంలో అగ్నికి ఆహుతైన 14 పూరిల్లు

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం బొడ్డపాడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో... 14 పూరిళ్లు.. అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిరాశ్రయులైన వారు అంతా మత్స్యకార కుటుంబాలు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details