ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను రోకలి బండతో చంపాడు...పోలీసులకు లొంగిపోయాడు

అనుమానం పెనుభూతంలా మారింది...అంతకంతకూ పెరుగుతూ...రోకలిబండతో భార్య తలపై కొట్టి చంపే వరకూ వెళ్లింది. ఫలితం ఒక నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది.

By

Published : Aug 28, 2019, 9:30 PM IST

భార్యను రోకలి బండతో చంపాడు...పోలీసులకు లొంగిపోయాడు


భార్య పై అనుమానం పెంచుకున్న భర్త.... రోకలి బండ తో కొట్టి చంపిన పోలీసులకు లొంగిపోయిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం లో జరిగింది. కంభం మండలం లింగోజిపల్లి చెందిన ఖాసీంపీరకు 2 ఏళ్ల క్రితం మార్కాపురానికి చెందిన కరీమున్​తో​ వివాహమైంది. అప్పటి నుంచి తరచూ మద్యం సేవిస్తూ భార్యతో గోడవపడేవాడని స్థానికులు తెలిపారు. అయితే ఇటీవల ఆమె పై అనుమానం పెంచుకుని వేధింపులకు గురి చేస్తున్న కారణంగా కరీమున్ పుట్టింటికి వెళ్లింది. అక్కడికి చేరుకున్న ఖాసీంపీరా... తెల్లవారు జామున భార్య నిద్రిస్తుస్తున్న సమయంలో రోకలి బండతో మోది...పోలీసులకు లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న కరీమున్ ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

భార్యను రోకలి బండతో చంపాడు...పోలీసులకు లొంగిపోయాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details