ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 24, 2020, 9:06 PM IST

ETV Bharat / state

గొలుసు చోరీ నిందితుడు అరెస్ట్.. ఆభరణం స్వాధీనం

నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసును చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో జరిగిన ఈ ఘటనలో.. 5 సవర్ల బంగారాన్ని నిందితుడి వద్ద నుంచి రికవరీ చేశారు.

chain snatcher arrest
గొలుసు దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన నిందితుడు పోలయ్యను.. ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 2 లక్షల విలువైన 5 సవర్ల బంగారు ఆభరణం స్వాధీనం చేసుకున్నారు.

వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో.. ఒక మహిళ మెడలో నుంచి రూ. 2 లక్షల విలువ గల 5 సవర్ల బంగారు గొలుసు, రెండు మంగళ సూత్రాలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పోలయ్య అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 5 సవర్ల బంగారు గొలుసు లభించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:భైరవకోన జలపాతం కొలనులో పడి వ్యక్తి మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details