ఐటీసీ కంపెనీకి చెందిన సిగరెట్లను బెంగళూరు నుంచి విజయవాడకు కంటైనర్లో తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్ ప్రాంతంలో సుమారు 10 మంది దొంగలు దారికాసి కంటైనర్ను అడ్డుకున్నారు. కంటైనర్ డ్రైవర్ను తీవ్రంగా కొట్టి, తాళ్లతో బంధించి రోడ్డు పక్కన పడేసి... కంటైనర్తో దొంగలు పరారయ్యారు. అక్కడినుంచి సింగరాయకొండ సమీపంలో పెరల్స్ డిస్టలరీస్ కంపెనీ వద్దకు వేరే వాహనలు తీసుకొచ్చి కంటైనర్లో ఉన్న సరకును తీసుకెళ్లారు. కంటైనర్ను అక్కడే వదిలేశారు. కంటైనర్ డ్రైవర్ రవి పరిస్థితిని చూసిన స్థానికులు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.
కంటైనర్ డ్రైవర్ను కొట్టి... సరకు చోరీ చేసీ..!
జాతీయ రహదారిపై దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ప్రకాశం జిల్లాకు చేరుకున్న కంటైనర్పై దొంగలు దాడి చేసి... అందులోని సరకు మాయం చేశారు. లక్షలు విలువ చేసే సిగరెట్లను వేరే వాహనాల్లో తరలించుకుపోయారు.
ఐటీసీ కంటైనర్ డ్రైవర్ను కొట్టి... సరకు చోరీ