ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 25, 2020, 6:59 PM IST

ETV Bharat / state

కంటైనర్​ డ్రైవర్​ను కొట్టి... సరకు చోరీ చేసీ..!

జాతీయ రహదారిపై దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ప్రకాశం జిల్లాకు చేరుకున్న కంటైనర్​పై దొంగలు దాడి చేసి... అందులోని సరకు మాయం చేశారు. లక్షలు విలువ చేసే సిగరెట్లను వేరే వాహనాల్లో తరలించుకుపోయారు.

thieves robbery at highway in prakasam district
ఐటీసీ కంటైనర్​ డ్రైవర్​ను కొట్టి... సరకు చోరీ

కంటైనర్​ డ్రైవర్​ను కొట్టి... సరకు చోరీ చేసీ..!

ఐటీసీ కంపెనీకి చెందిన సిగరెట్ల​ను బెంగళూరు నుంచి విజయవాడకు కంటైనర్లో తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్​ ప్రాంతంలో సుమారు 10 మంది దొంగలు దారికాసి కంటైనర్​ను అడ్డుకున్నారు. కంటైనర్​ డ్రైవర్​ను తీవ్రంగా కొట్టి, తాళ్లతో బంధించి రోడ్డు పక్కన పడేసి... కంటైనర్​తో దొంగలు పరారయ్యారు. అక్కడినుంచి సింగరాయకొండ సమీపంలో పెరల్స్​ డిస్టలరీస్​ కంపెనీ వద్దకు వేరే వాహనలు తీసుకొచ్చి కంటైనర్​లో ఉన్న సరకును తీసుకెళ్లారు. కంటైనర్​ను అక్కడే వదిలేశారు. కంటైనర్​ డ్రైవర్​ రవి పరిస్థితిని చూసిన స్థానికులు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details